Bank of India: బీఓఐ లాభంలో 82 శాతం వృద్ధి
ABN , Publish Date - May 10 , 2025 | 06:13 AM
బ్యాంక్ ఆఫ్ ఇండియా (బీఓఐ) మార్చితో ముగిసిన త్రైమాసికంలో 82 శాతం లాభ వృద్ధి నమోదు చేసింది. నికర వడ్డీ ఆదాయం 2 శాతం పెరిగి రూ.6,063 కోట్లకు చేరుకోగా, ఇతర ఆదాయం 96 శాతం పెరిగి రూ.3,428 కోట్లుగా నమోదైంది.

ముంబై: బ్యాంక్ ఆఫ్ ఇండియా (బీఓఐ).. మార్చితో ముగిసిన చివరి త్రైమాసికంలో రూ.2,626 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. 2023-24 ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో పోల్చితే లాభం ఏకంగా 82 శాతం వృద్ధి చెందింది. సమీక్షా త్రైమాసికంలో నికర వడ్డీ ఆదాయం 2 శాతం వృద్ధి చెంది రూ.6,063 కోట్లకు చేరుకోగా ఇతర ఆదాయం 96 శాతం పెరిగి రూ.3,428 కోట్లుగా నమోదైంది. కాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26)లో 12-13 శాతం రుణ వృద్ధి, 11-12 శాతం డిపాజిట్లలో వృద్ధిని లక్ష్యంగా పెట్టుకున్నట్లు బ్యాంక్ ఎండీ, సీఈఓ రజనీష్ కర్నాటక్ తెలిపారు.