గవర్నర్ను జగన్ ఎందుకు కలిశారో?: వర్ల
ABN , Publish Date - Jul 29 , 2025 | 06:02 AM
వర్నర్ను జగన్ మాజీ సీఎం హోదాలో అధికారికంగా కలిశారా, లేక వ్యక్తిగతంగానా, అని టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ప్రశ్నించారు.
అమరావతి, జూలై 28(ఆంధ్రజ్యోతి): గవర్నర్ను జగన్ మాజీ సీఎం హోదాలో అధికారికంగా కలిశారా? లేక వ్యక్తిగతంగానా? అని టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ప్రశ్నించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా గవర్నర్ని కలిసి మాట్లాడిన విషయం ప్రజలకు జగన్ ఎందుకు తెలియజేయడంలేదని నిలదీశారు. నిజాలను బహిర్గతం చేయటానికి జగన్కు అంత భయం ఎందుకని నిలదీశారు.