సంక్షేమ పథకాలు, అభివృద్ధిపై తెలియజేయాలి
ABN , Publish Date - Jun 28 , 2025 | 11:39 PM
రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రజా సంక్షేమం, అభివృద్ధి కోసం అందిస్తున్న పథకాలపై నాయ కులు, కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లాని టీడీపీ ఇన్చార్జి భూపేశ్రెడ్డి అన్నారు.
జమ్మలమడుగు, జూన్ 28 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రజా సంక్షేమం, అభివృద్ధి కోసం అందిస్తున్న పథకాలపై నాయ కులు, కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లాని టీడీపీ ఇన్చార్జి భూపేశ్రెడ్డి అన్నారు. శనివారం జమ్మలమడుగు టీడీపీ కార్యాలయంలో ప్రభుత్వ కార్యక్రమాల గురించి, కస్లర్టర్, యూనిట్, బూత్ ఇన్చార్జిలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం ప్రజలకు చేసిన మంచి పనుల గురించి తెలియజేశారు. పెన్షన్లు, ఉచిత గ్యాస్ సిలిండర్లు, తల్లికి వందనం, మెగా డీఎస్సీ, అన్న క్యాంటిన్లు, పథకాల గురించి ప్రతి ఒక్కరికి తెలియజేయాలన్నారు. ప్రతి ఇంటి దగ్గరకు వెళ్లి ఆ ఇంటిలో సంక్షేమం పథకాలు అందాయా? లేక అందలేదా? అనూ సమస్యలపై మై టీడీపీ యాప్ ద్వారా ప్రభుత్వానికి తెలియజేసేలా ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు జూలై 2వ తేదీ నుంచి జరిగే సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళుతున్నామన్నారు. కార్యక్రమంలో ఇన్చార్జిలకు దిశ, నిర్దేశం భూపేశ్రెడి ్డ చేశారు. సమావేశంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, క్లస్టర్, యూనిట్, బూత్ ఇన్చార్జిలు పాల్గొన్నారు.