లోకపావనికి నీరాజనం
ABN , Publish Date - Sep 23 , 2025 | 11:51 PM
దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా రెండో రోజైన మంగళవారం లోకపావని భక్తుల నుం చి నీరాజనాలు అందుకుంటున్నారు.
ప్రొద్దుటూరు సెప్టెంబరు 23(ఆంధ్ర జ్యోతి): దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా రెండో రోజైన మంగళవారం లోకపావని భక్తుల నుం చి నీరాజనాలు అందుకుంటున్నారు. దసరా ఉత్సవాల్లో భాగంగా మంగళవారం అమ్మవారు భవానీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. వాసవీ కన్యకాపరమేశ్వరీదేవి ఆలయంలో, రతనాల వెంకటేశ్వర ఆలయంలో, శాసి్త్రనగర్లో రాజరాజేశ్వరీదేవి ఆలయంలో, ముక్తిరామలింగేశ్వరస్వామి ఆలయంలో అమ్మవారు భవానీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. వెంకటేశ్వర్లుపేటలోని చౌడేశ్వరీదేవి ఆలయంలో, శివాలయంలో మంగళగౌరీ అలంకారం భక్తులను ఆకట్టుకుంది. చెన్నకేశవస్వామి ఆలయంలో ధాన్యలక్ష్మిగా అమ్మవారిని అలంకరించారు. భక్తులు ఆలయానికి చేరుకుని అలంకారాలను తిలకించి భక్తిశ్రద్ధలతో మొక్కుకున్నారు.
ఎర్రగుంట్లలో: మెయినబజార్లోని వాసవాంబ మంగళవారం భవానిదేవి అలంకారంలో భక్తు లను కటాక్షించారు. ఏరువాకగంగమ్మ ఆలయం లో అమ్మవారికి రాజరాజేశ్వరీదేవిగా, చౌడేశ్వరీ దేవి ఆలయంలో బాలాత్రిపురసుం దరీదేవిగా, మహాఅంకమ్మ అమ్మవారు గాయత్రీదేవిగానూ దర్శనమిచ్చారు. ఐసీయల్ కాలనీలో పార్వ తీదేవికి, దుర్గాదేవికి పూజలు నిర్వహించారు.
జమ్మలమడుగులో: దసరా శరన్నవరాత్రుల ఉత్సవాలలో రెండో రోజు మత్కన్యకాపరమేశ్వరీదేవి గాయత్రీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అలాగే కన్నెతీర్థంలోనిబాలత్రిపుర సుందరీదేవి అమ్మవారు కాత్యాయని దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. దేవగుడి లోని తలకంఠీశ్వరస్వామి ఆలయంలో మాజీ ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి దంపతులు అమ్మవారికి పూజలు నిర్వహించారు.
మైదుకూరు రూరల్లో :పట్టణంలోని వాసవీ కన్యకా పరమేశ్వరిదేవి అమ్మవారిశాలలో దసరా ఉత్సవాలలో భాగంగా మంగళవారం గాయత్రిదే వి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనం ఇచ్చారు. ఆర్యవైశ్య సభ అధ్యక్షుడు బల్లాని చెన్నకేశవ ప్రసాద్ వారి నూతన కార్యవర్గం వేడుకలను వైభవంగా నిర్వహిస్తున్నారు.