Vijayawada: నకిలీ మద్యం నిందితులకు రిమాండ్ పొడిగింపు
ABN , Publish Date - Nov 07 , 2025 | 05:37 AM
నకిలీ మద్యం తయారీ కేసులో 11 మంది నిందితులకు విజయవాడ ఆరో అదనపు జ్యుడిషియల్ ఫస్ట్క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు రిమాండ్ను పొడిగించింది.
బెయిల్ పిటిషన్లపై విచారణ 11కు వాయిదా
విజయవాడ, నవంబరు 6(ఆంధ్రజ్యోతి): నకిలీ మద్యం తయారీ కేసులో 11 మంది నిందితులకు విజయవాడ ఆరో అదనపు జ్యుడిషియల్ ఫస్ట్క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు రిమాండ్ను పొడిగించింది. న్యాయాధికారి జి.లెనిన్బాబు గురువారం ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చారు. నెల్లూరు కేంద్ర కారాగారంలో ప్రధాన నిందితుడు అద్దేపల్లి జనార్దనరావు, తిరుమలశెట్టి శ్రీనివాసరావు, డి.శ్రీనివాసరెడ్డి, అంగులూరి వెంకట కల్యాణ్, నకిరికంటి రవి, తాండ్ర రమే్షబాబు, షేక్ అల్లాబక్షు, చెక్కా సతీ్షకుమార్, విజయవాడ జిల్లా జైల్లో అద్దేపల్లి జగన్మోహనరావు, బాదల్ దాస్, ప్రదీప్ దాస్ ఉన్నారు. వారిని వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా న్యాయాధికారి ముందు హాజరుపరిచారు. వారికి 13వ తేదీ వరకు రిమాండ్ను పొడిగించారు. మరోవైపు ఈ కేసులో తొమ్మిది మంది నిందితులతోపాటు జోగిబ్రదర్స్ వేసిన బెయిల్ పిటిషన్లపై విచారణను ఆరో అదనపు జ్యుడిషియల్ ఫస్ట్క్లాస్ మేజిస్ర్టేట్ కోర్టు 11వ తేదీకి వాయిదా వేసింది. అద్దేపల్లి బ్రదర్స్, నకిరికంటి రవి, బాదల్ దాస్, ప్రదీప్ దాస్, డి.శ్రీనివాసరెడ్డి, అంగులూరు వెంకట కల్యాణ్, తిరుమలశెట్టి శ్రీనివాసరావు, చెక్కా సతీ్షకుమార్, జోగి సోదరుల బెయిల్ పిటిషన్లపై ఎక్సైజ్ అధికారులు గురువారం కౌంటర్ దాఖలు చేశారు.