మాతమార్పిడులపై విచారణ జరపాలి: విజయసాయి
ABN , Publish Date - Dec 08 , 2025 | 05:18 AM
హిందూమతంపై కుట్రలను సహించేది లేదని, డబ్బు ఆశ చూపి మతం మార్చాలని ప్రయత్నించే వారికి తగిన గుణపాఠం చెబుదామని...
అమరావతి, డిసెంబరు 7(ఆంధ్రజ్యోతి): హిందూమతంపై కుట్రలను సహించేది లేదని, డబ్బు ఆశ చూపి మతం మార్చాలని ప్రయత్నించే వారికి తగిన గుణపాఠం చెబుదామని రాష్ట్ర ప్రజలకు మాజీ ఎంపీ వి.విజయసాయిరెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం ఆయన ఎక్స్లో చేసిన ట్వీట్లో.. గత రెండు దశాబ్దాలుగా హిందూమత మార్పిడులపై ప్రభుత్వం కమిటీ వేసి విచారణ జరపాలని డిమాండ్ చేశారు. దేశం కోసం, ధర్మం కోసం హిందువులలో ఉన్న అన్ని సామాజికవర్గాలు ఒక్కటవ్వాలని సూచించారు. అదే దేశానికి ఆత్మరక్ష, శ్రీరామరక్షగా పేర్కొన్నారు.