Tirumala Visit: నేడు తిరుమలకు ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
ABN , Publish Date - Sep 24 , 2025 | 04:57 AM
ఉపరాష్ట్రపతి సి.పి.రాధాకృష్ణన్ బుధవారం తొలిసారి అధికారిక హోదాలో తిరుమలకు రానున్నారు. ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయం చేరుకుంటారు.
సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ కూడా...
ఇంటర్నెట్ డెస్క్ : ఉపరాష్ట్రపతి సి.పి.రాధాకృష్ణన్ బుధవారం తొలిసారి అధికారిక హోదాలో తిరుమలకు రానున్నారు. ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయం చేరుకుంటారు. రోడ్డు మార్గాన 8.30 గంటలకు తిరుమల చేరుకుని శ్రీవారిని దర్శించుకుంటారు. గురువారం మరోసారి స్వామిని దర్శించుకుని, కొండపై పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక, సీఎం చంద్రబాబు విజయవాడ నుంచి హెలికాప్టర్లో బయల్దేరి బుధవారం సాయంత్రం 5.35 గంటలకు తిరుపతి చేరుకుంటారు. రోడ్డు మార్గాన రాత్రి 8గంటలకు శ్రీవారి ఆలయానికి చేరుకుని స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు నుంచి మంత్రి లోకేశ్ హెలికాప్టర్లో బయల్దేరి సాయంత్రం 5 గంటలకు తిరుపతి చేరుకుంటారు. అక్కడినుంచి రోడ్డు మార్గాన తిరుమల చేరుకుని, రాత్రికి శ్రీవారిని దర్శించుకుంటారు.