Share News

శంభాజీ మహారాజ్‌కు చిత్రనివాళి

ABN , Publish Date - Mar 11 , 2025 | 12:00 AM

ధర్మవీరుడు శంభాజీ మహారాజ్‌ వర్దంతి(మార్చి 11) సందర్భంగా ఆయన జీవిత చరిత్రలోని కొన్ని ముఖ్యఘట్టాలను ఒకే చిత్రంలో చిత్రీకరించాడు నంద్యాలకు చెందిన ప్రముఖ చిత్రకారుడు చింతలపల్లె కోటేష్‌. శంభాజీ బాల్యం నుంచి మరణం వరకు ఉన్న ప్రధాన ఘట్టాలు ఈ చిత్రంలో చూడవచ్చు.

 శంభాజీ మహారాజ్‌కు చిత్రనివాళి
ఒకే చిత్రంలో శంభాజీ చరిత్రలో ప్రధాన ఘట్టాలు

నంద్యాల కల్చరల్‌, మార్చి 10(ఆంధ్రజ్యోతి): ధర్మవీరుడు శంభాజీ మహారాజ్‌ వర్దంతి(మార్చి 11) సందర్భంగా ఆయన జీవిత చరిత్రలోని కొన్ని ముఖ్యఘట్టాలను ఒకే చిత్రంలో చిత్రీకరించాడు నంద్యాలకు చెందిన ప్రముఖ చిత్రకారుడు చింతలపల్లె కోటేష్‌. శంభాజీ బాల్యం నుంచి మరణం వరకు ఉన్న ప్రధాన ఘట్టాలు ఈ చిత్రంలో చూడవచ్చు. ఈ సందర్భంగా కోటేష్‌ మాట్లాడుతూ.. ఛత్రపతి శివాజీ కుమారుడే శంభాజీ మహారాజ్‌ అన్నారు. శివాజీ మరణం తర్వాత శంభాజీ మహారాజ్‌ 9 సంవత్సరాలు పరిపాలన చేసి 120 యుద్ధాల్లో తమ పరాక్రమం చూపించిన ధీరశాలి అన్నారు. శంభాజీ మహారాజ్‌ తన తండ్రి ఛత్రపతి శివాజీ మాదిరిగానే మంచి పరిపాలన చేశారన్నారు. ఆయన పాలనలో స్త్రీలను గౌరవించడం, మంచి క్రమశిక్షణ, బాధ్యత కలిగిన పరిపాలకుడు అన్నారు.

Updated Date - Mar 11 , 2025 | 12:00 AM