Share News

ప్రొద్దుటూరులో దొంగతనాలను అరికట్టాలి

ABN , Publish Date - Apr 26 , 2025 | 11:35 PM

ప్రొద్దుటూరులో ఇటీవల జరుగు తున్న దొంగతనాలతో ప్రజలు అభద్రతతో వున్నారని... వెంటనే దొంగతనాల ను అరికట్టేందుకు చర్యలు చేపట్టాలని ఎస్పీ ఈజీ అశోక్‌కుమార్‌ను ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి కోరారు.

ప్రొద్దుటూరులో   దొంగతనాలను అరికట్టాలి
ఎస్పీ అశోక్‌కుమార్‌ను కలిసిన ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి

ప్రొద్దుటూరు, ఏప్రిల్‌ 26 (ఆంధ్రజ్యోతి): ప్రొద్దుటూరులో ఇటీవల జరుగు తున్న దొంగతనాలతో ప్రజలు అభద్రతతో వున్నారని... వెంటనే దొంగతనాల ను అరికట్టేందుకు చర్యలు చేపట్టాలని ఎస్పీ ఈజీ అశోక్‌కుమార్‌ను ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి కోరారు. శనివారం ఉదయం కడపలోని ఎస్పీ కార్యాలయం లో ఆయను ఎమ్మెల్యే కలిసి విజ్ఞప్తి చేశారు. అలాగే మట్కా, క్రికెట్‌ బెట్టింగ్‌, గ్యాబ్లింగ్‌, గంజాయి లాంటి వాటిని పూర్తిగా అరిక ట్టాలన్నారు. ఇందుకు ఎస్పీ స్పందిస్తూ ప్రత్యేక పోలీసు బలగాలు దొంగలను పట్టుకునే పనిలో ఉన్నారన్నారు. త్వరలోనే వారి ఆటకట్టిస్తామన్నారు. అసాంఘీక కార్యకలాపా లన్నింటిపై పూర్తిస్థాయి నిఘా పెట్టామన్నారు. ఎస్పీని కలిసిన వారిలో టీడీపీ నేతలు వంగల నారాయణరెడ్డి, రసూల్‌గౌస్‌ ఉన్నారు.

Updated Date - Apr 26 , 2025 | 11:35 PM