Share News

Housing Department: హౌసింగ్‌లో 23 మంది ఏఈలకు పదోన్నతి

ABN , Publish Date - Aug 31 , 2025 | 06:03 AM

రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో పని చేస్తున్న 23 మంది హౌసింగ్‌ ఏఈలకు ప్రభుత్వం డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్లు(డీఈఈ)గా పదోన్నతులు కల్పించింది.

Housing Department: హౌసింగ్‌లో 23 మంది ఏఈలకు పదోన్నతి

అమరావతి, ఆగస్టు 30(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో పని చేస్తున్న 23 మంది హౌసింగ్‌ ఏఈలకు ప్రభుత్వం డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్లు(డీఈఈ)గా పదోన్నతులు కల్పించింది. ఈ మేరకు రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఎం.శివప్రసాద్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పదోన్నతులు పూర్తిగా తాత్కాలిక ప్రాతిపదికనే అమలవుతాయని, న్యాయస్థానాల్లో పెండింగ్‌లో ఉన్న కేసులపై తుది తీర్పులను అనుసరించి ఎప్పుడైనా నోటీసులు ఇవ్వకుండా, కారణాలు చెప్పకుండానే తిరిగి ఏఈలుగా నియమిస్తామని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.

Updated Date - Aug 31 , 2025 | 06:03 AM