Share News

Telugu Expats: ఒమన్‌లో ప్రవాసుల సహస్ర లింగార్చన

ABN , Publish Date - Nov 03 , 2025 | 06:34 AM

కార్తీక మాసాన్ని పురస్కరించుకొని ఎడారి దేశం ఒమన్‌లోని తెలుగు ప్రవాసులు సహస్ర లింగార్చన చేశారు. రాజధాని మస్కట్‌లో అక్టోబరు 31న...

 Telugu Expats: ఒమన్‌లో ప్రవాసుల సహస్ర లింగార్చన

(ఆంధ్రజ్యోతి గల్ఫ్‌ ప్రతినిధి)

కార్తీక మాసాన్ని పురస్కరించుకొని ఎడారి దేశం ఒమన్‌లోని తెలుగు ప్రవాసులు సహస్ర లింగార్చన చేశారు. రాజధాని మస్కట్‌లో అక్టోబరు 31న వేద మంత్రోచ్ఛారణల మధ్య ఈ కార్యక్రమం కనులపండువగా సాగింది. వేద పండితులు ధర్మపురి విజయకుమార్‌ ఆధ్వర్యంలో తయారు చేసిన 1,115 మట్టి లింగాలకు పురోహితులు రుద్రాభిషేకం నిర్వహించారు. ముఖ్య నిర్వాహకులు, చిరు మెగా యూత్‌ ఫోర్స్‌ అధ్యక్షుడు చందక రాందాస్‌ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రముఖ ప్రవచనకర్త డాక్టర్‌ అనంతలక్ష్మి, ఒమన్‌లోని భారత రాయబారి జి.వి. శ్రీనివాస్‌, సికింద్రాబాద్‌ మహంకాళీ డివిజన్‌ ఏసీపీ ఎస్‌. సైదయ్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 03 , 2025 | 06:35 AM