Korukonda Sainik School: సైనిక పాఠశాలల్లో ఏపీకి 67 శాతం సీట్లు
ABN , Publish Date - May 03 , 2025 | 05:06 AM
2025-26 విద్యాసంవత్సరం నుంచి కోరుకొండ, కలికిరి సైనిక పాఠశాలల్లో ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు 67 శాతం సీట్లు రిజర్వు చేయనున్నారు. తెలంగాణ విద్యార్థులు ఇకపై ఇతర రాష్ట్రాల కోటాలో 33 శాతం సీట్లలో మాత్రమే పోటీ చేయాలి.
అమరావతి, మే 2(ఆంధ్రజ్యోతి): కోరుకొండ, కలికిరి సైనిక పాఠశాలల్లో ఇక నుంచి రాష్ట్ర విద్యార్థులకు 67 శాతం సీట్లు అందుబాటులో ఉంటాయని కోరుకొండ సైనిక పాఠశాల ప్రకటించింది. తెలంగాణ విద్యార్థులకు ఇకపై 67 శాతం సీట్ల రిజర్వేషన్ ఉండబోదని, ఈ మేరకు అడ్మిషన్ల నిబంధనలు మారాయని పేర్కొంది. 2025-26 విద్యాసంవత్సరం నుంచి ఈ కొత్త నిబంధనలు అమల్లోకి వస్తాయని వెల్లడించింది. ఇతర రాష్ట్రాల విద్యార్థులకు కేటాయించే 33 శాతం సీట్లలోనే తెలంగాణ విద్యార్థులు కూడా ఉంటారని స్పష్టం చేసింది.
ఇవి కూడా చదవండి..