Former IAS Dr K. Lakshminarayana: జ్ఞానానికి సాంకేతికత ప్రత్యామ్నాయం కాదు
ABN , Publish Date - Sep 05 , 2025 | 06:04 AM
మనిషి జ్ఞానానికి సాంకేతిక అనేది ఎప్పటికీ ప్రత్యామ్నాయం కాదని మాజీ ఐఏఎస్ అధికారి డాక్టర్ కె.లక్ష్మీనారాయణ స్పష్టంచేశారు.
మాజీ ఐఏఎస్ డాక్టర్ కె.లక్ష్మీనారాయణ
తిరుపతి (విశ్వవిద్యాలయాలు), సెప్టెంబరు 4 (ఆంధ్రజ్యోతి): మనిషి జ్ఞానానికి సాంకేతిక అనేది ఎప్పటికీ ప్రత్యామ్నాయం కాదని మాజీ ఐఏఎస్ అధికారి డాక్టర్ కె.లక్ష్మీనారాయణ స్పష్టంచేశారు. ‘ఎంపవరింగ్ ఎడ్యుకేషన్ త్రూ టెక్నాలజీ: ట్రెండ్స్ అండ్ ఇన్నోవేషన్స్’ అంశంపై తిరుపతిలోని జాతీయ సంస్కృత వర్సిటీలో మూడు రోజులుగా జరుగుతున్న అంతర్జాతీయ సదస్సు గురువారం ముగిసింది. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ, అవసరానికి మించి టెక్నాలజీని వాడుకోవడం మంచిది కాదని హితవు పలికారు.