Share News

సాంకేతిక పరిజ్ఞానంతో బోధించాలి

ABN , Publish Date - Dec 02 , 2025 | 11:07 PM

విద్యార్థులకు విద్యా బోధన సాంకేతిక పరిజ్ఞానంలో బోధిస్తే ఉజ్వలమైన భవిష్యత ఉంటుందని డీఈవో జనార్దనరెడ్డి అన్నారు.

సాంకేతిక పరిజ్ఞానంతో బోధించాలి
విద్యార్థులతో మాట్లాడుతున్న డీఈవో జనార్దనరెడ్డి

గోస్పాడు, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి) : విద్యార్థులకు విద్యా బోధన సాంకేతిక పరిజ్ఞానంలో బోధిస్తే ఉజ్వలమైన భవిష్యత ఉంటుందని డీఈవో జనార్దనరెడ్డి అన్నారు. మంగళవారం మం డలంలోని ఎం చింతకుంట్ల, కానాలపల్లె ప్రాథమిక పాఠశాలలను ఆ యన తనిఖీ చేశారు. విద్యార్థుల పఠన సామర్థ్యాలను, ప్రగతి రిపో ర్టులను పరిశీలించారు. ఒకటవ తరగతి నుంచి ఐదవ తరగతి వరకు నిర్వహిస్తున్న ఎప్‌ఎల్‌ఎన ప్రక్రియను, అంగనవాడీ స్కూళ్లలో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో ఎంఈవో అబ్దుల్‌కరీం, ఉపాధ్యాయుడు శివనాగిరెడ్డి, సీఆర్‌ఎంటీ వెంకటేష్‌ పాల్గొన్నారు.

Updated Date - Dec 02 , 2025 | 11:07 PM