Share News

Visakhapatnam: ఇదిగో టీసీఎస్‌

ABN , Publish Date - Sep 03 , 2025 | 03:55 AM

విశాఖపట్నంలో ఐటీ రంగాన్ని మరో మెట్టుపైకి తీసుకువెళ్లే దిగ్గజ కంపెనీ టీసీఎస్‌ తన కార్యకలాపాలు ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. రుషికొండ ఐటీ పార్కు హిల్‌..

Visakhapatnam: ఇదిగో టీసీఎస్‌

  • వైజాగ్‌ మిలీనియం టవర్స్‌పై బోర్డు ఏర్పాటు

  • పూర్తి కావొచ్చిన ఇంటీరియర్‌ పనులు

  • త్వరలోనే కార్యకలాపాలు

  • విశాఖలో టీసీఎస్‌ బిల్డింగ్‌ సిద్ధం

విశాఖపట్నం, సెప్టెంబరు 2(ఆంధ్రజ్యోతి): విశాఖపట్నంలో ఐటీ రంగాన్ని మరో మెట్టుపైకి తీసుకువెళ్లే దిగ్గజ కంపెనీ టీసీఎస్‌ తన కార్యకలాపాలు ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. రుషికొండ ఐటీ పార్కు హిల్‌ నంబరు-3పై మిలీనియం టవర్స్‌ను టీసీఎస్‌కు ప్రభుత్వం కేటాయించిన విషయం తెలిసిందే. బిల్డింగ్‌లో అవసరమైన ఇంటీరియర్‌ పనులన్నీ టీసీఎస్‌ చేయిస్తోంది. ఇవి పూర్తికావచ్చాయి. భవనంపై టీసీఎస్‌ పేరుతో బోర్డును ఏర్పాటు చేసింది. త్వరలో 2 వేల మంది ఉద్యోగులతో ఈ క్యాంపస్‌ ప్రారంభం కానుంది. హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నై తదితర నగరాల్లో పనిచేస్తున్న ఉత్తరాంధ్రకు చెందిన ఉద్యోగులను తొలుత విశాఖపట్నం తీసుకువచ్చి, ఆ తరువాత కొత్తవారిని రిక్రూట్‌ చేసుకుంటారని సమాచారం. కాగా, టీసీఎస్‌ సొంత క్యాంపస్‌ ఏర్పాటు చేసుకోవడానికి రుషికొండ ఐటీ పార్కులోని హిల్‌ నంబరు-3 పైనే 21.6 ఎకరాలు కేటాయించిన సంగతి తెలిసిందే. ఎకరా 99 పైసలు చొప్పున ఇచ్చారు. సుమారు రూ.1,370 కోట్ల పెట్టుబడితో 12 వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని హామీ ఇవ్వడంతో ప్రభుత్వం భూమి ఇచ్చింది.

Updated Date - Sep 03 , 2025 | 03:55 AM