Supreme Court: ఇసుక అక్రమ తవ్వకాల కేసు విచారణ వాయిదా
ABN , Publish Date - Aug 02 , 2025 | 05:32 AM
గత జగన్ ప్రభుత్వ హయాంలో ఇసుక అక్రమ తవ్వకాలకు సంబంధించిన కేసు విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది.
జీఎన్టీ తీర్పుపై సుప్రీంలో జేపీ పిటిషన్
న్యూఢిల్లీ, ఆగస్టు 1(ఆంధ్రజ్యోతి): గత జగన్ ప్రభుత్వ హయాంలో ఇసుక అక్రమ తవ్వకాలకు సంబంధించిన కేసు విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. నాడు ఇసుక అక్రమ తవ్వకాలకు సంబంధించి జేపీ వెంచర్స్కు వ్యతిరేకంగా గ్రీన్ ట్రైబ్యునల్ తీర్పు ఇచ్చింది. జేపీ వెంచర్స్కు దాదాపు రూ.18 కోట్ల జరిమానా విధించింది. గ్రీన్ ట్రైబ్యునల్ తీర్పుపై 2023 మే 15న జేపీ వెంచర్స్ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఆ పిటిషన్ శుక్రవారం జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చింది. అయితే, ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా అందుబాటులో లేరని జూనియర్ న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో తదుపరి విచారణను సెప్టెంబరు 3కు సుప్రీంకోర్టు వాయిదా వేసింది.