పావన లక్ష్మీనరసింహ స్వామికి ప్రత్యేక పూజలు
ABN , Publish Date - Jun 02 , 2025 | 12:18 AM
మండలంలోని ఓబులంపల్లెలో వెలసిన పావన లక్ష్మినరసింహ స్వామి పునఃప్రతిష్ఠ కార్యక్రమంలో ఆదివా రం ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ పాల్గొని స్వామికి ప్రత్యేక పూజలు చేశారు.
ఆళ్లగడ్డ జూన 1(ఆంద్రజ్యోతి): మండలంలోని ఓబులంపల్లెలో వెలసిన పావన లక్ష్మినరసింహ స్వామి పునఃప్రతిష్ఠ కార్యక్రమంలో ఆదివా రం ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ పాల్గొని స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయానికి చేరుకొన్న ఎమ్మెల్యేకు కమిటీ సభ్యులు , టీడీపీ నా యకులు గౌరు వెంటరామిరెడ్డి ఆధ్వర్యంలో గజమాల వేసి సత్కరించారు. ఆలయ పూజారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయ ప్రతిష్ఠ మహోత్సవాన్ని తిలకించేందుకు వివిధ ప్రాంతాల భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, టీడీపీ నాయకులు శంకరయ్య, సుబ్బారెడ్డి, రామసుబ్బారెడ్డి, నరసింహా పాల్గొన్నారు.
డీలర్ల ద్వారా రేషన పంపిణీ
ప్రజలు ఇబ్బందులు పడకుండా ఉండేందుకే ప్రభుత్వం డీలర్ల ద్వారా రేషన పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టిందని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అన్నారు. ఆదివారం పట్టణంలోని కొత్త మసీదు కాలనీలోని ఇమాంబీ చౌకదుకాణంలో రేషన పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. కార్యక్రమంలో తహసీల్దార్ జ్యోతి రత్నకుమారి, డీటీ చంద్రశేఖర్రెడ్డి, రేషన డీలర్ల సంఘం మండల అధ్యక్షుడు మజీద్ పాల్గొన్నారు.