Speaker Ayyanna Criticizes Jagan: పిచ్చెక్కినట్టు మాట్లాడుతున్నారు
ABN , Publish Date - Aug 15 , 2025 | 05:48 AM
జగన్ పిచ్చెక్కినట్లు... నోటికొచ్చింది మాట్లాడుతున్నారని, జగన్ వ్యాఖ్యలను ప్రజాస్వామ్యవాదులంతా ఖండించాలని స్పీకర్...
అమరావతి, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి): జగన్ పిచ్చెక్కినట్లు... నోటికొచ్చింది మాట్లాడుతున్నారని, జగన్ వ్యాఖ్యలను ప్రజాస్వామ్యవాదులంతా ఖండించాలని స్పీకర్ అయ్యన్నపాత్రుడు అన్నారు. అసెంబ్లీ ప్రాంగణంలో గురువారం అయ్యన్న విలేకరులతో మాట్లాడారు. పులివెందులలో ఓడిపోవడంతో ఆయన పిచ్చి పట్టినట్లు మాట్లాడుతున్నారని, జగన్ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతుంటే వినటానికే చాలా అసహ్యంగా ఉందన్నారు.