Share News

లిక్కర్‌ స్కాంను సిట్‌ నిగ్గుతేలుస్తుంది: పితాని

ABN , Publish Date - Aug 02 , 2025 | 06:06 AM

గత జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వంలో లిక్కర్‌ స్కాంపై సిట్‌ దర్యాప్తు సంస్థ నిగ్గు తేలుస్తుందని ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ అన్నారు.

లిక్కర్‌ స్కాంను సిట్‌ నిగ్గుతేలుస్తుంది: పితాని

పెనుమంట్ర, ఆగస్టు 1(ఆంధ్రజ్యోతి): గత జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వంలో లిక్కర్‌ స్కాంపై సిట్‌ దర్యాప్తు సంస్థ నిగ్గు తేలుస్తుందని ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ అన్నారు. శుక్రవారం పశ్చిమగోదావరి జిల్లా పొలమూరులో వ్యవసాయ విశాల పరపతి సంఘం త్రిసభ్య కమిటీ చైర్మన్‌గా కండిబోయిన శ్రీనివాస్‌ ప్రమాణ స్వీకారోత్సవంలో ఎమ్మెల్యే పితాని పాల్గొని మాట్లాడారు. ఎప్పుడూ కనీవినీ ఎరుగని రీతిలో జే బ్రాండ్ల ద్వారా నాసిరకం మద్యాన్ని ప్రభుత్వం విక్రయించి ప్రజల జీవితాలతో చెలగాటమాడిందని విమర్శించారు. ప్రజాధనాన్ని ప్రభుత్వానికి చేరకుండా పక్కదారి పట్టించిందని ఆరోపించారు. జగన్‌ మీడియా అవాస్తవాలను వాస్తవాలుగా ప్రజలను నమ్మించాలని చూస్తుందని పితాని ఆరోపించారు.

Updated Date - Aug 02 , 2025 | 06:06 AM