Weather Update: పెరిగిన చలి
ABN , Publish Date - Dec 08 , 2025 | 05:01 AM
రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో చలి తీవ్రత పెరిగింది. ఆదివారం రాత్రి ఉష్ణోగ్రతలు...
ఏజెన్సీలోని కిలగాడలో 7.7 డిగ్రీలు నమోదు
రాష్ట్రంలో పడిపోతున్న కనిష్ఠ ఉష్ణోగ్రతలు
విశాఖపట్నం, డిసెంబరు 7(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో చలి తీవ్రత పెరిగింది. ఆదివారం రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీలు తక్కువగా నమోదయ్యాయి. అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీలోని కిలగాడలో 7.7, డుంబ్రిగుడలో 8.2, మైదాన ప్రాంతంలోని కళింగపట్నంలో 15.7 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.