గ్రామీణ రోడ్లకు మహర్దశ
ABN , Publish Date - Jul 27 , 2025 | 11:48 PM
కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రధాన రహదారులే కాకుండా గ్రామీ ణ రహదారులకు మహర్దశ కల్పించింది.
రాజుపాలెం, జూలై 27 (ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రధాన రహదారులే కాకుండా గ్రామీ ణ రహదారులకు మహర్దశ కల్పించింది. ఇందులో భాగంగా రాజుపాళెం మండల పరిధిలోని అయ్యవారుపల్లె, గాదెగూడూరు , టంగుటూరు గ్రామాలను కలుపుతూ పం చాయతీ రాజ్ శాఖ ఆధ్వర్యంలో తారురోడ్డు నిర్మాణం పూర్తి చేశారు. ఎన్నో ఏళ్లుగా ఈ గ్రామాలను కలుపుతూ రోడ్డు నిర్మాణం లేదని తెలపడంతో ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నం ద్యాల వరద రాజులరెడ్డి సహకారంతో పంచాయ తీరాజ్ శాఖ ఆధ్వర్యంలో కోటి 55లక్షలతో ఈ కొత్తరోడ్డు నిర్మాణం చేపట్టారు. దీంతో మూడు గ్రామాలు కలపడంతో పాటు రైతన్నలు పంట పొలాలకు వెళ్లేందుకు కూడా ఆ రోడ్డు అనుకూలంగా మారింది. అదే విధంగా ఈ రోడ్డు నిర్మాణం లోనే వెంగలాయపల్లె గ్రామానికి రోడ్డు వేస్తే ఈ ప్రాంత ప్రజలు జమ్మలమడుగుకు పోయేందుకు తక్కువ కిలోమీ టర్ల వస్తుందని అన్నారు. ఈ రోడ్డునిర్మాణాన్ని టెక్మా కన స్ట్రక్షన కాంట్రాక్టర్ మహేశ్వర్రెడ్డి ఆధ్వర్యంలో ఈ రోడ్డు నిర్మాణం చేపట్టారు. పంచాయతీరాజ్ డీఈ లక్ష్మినారాయణ రెడ్డి తదితరుల అధికారులతో కలిసి ఈ రోడ్డును పరిశీలించారు.