Krishnavenamma: కృష్ణవేణమ్మ పాదాలను తాకిన సముద్రుడు
ABN , Publish Date - Apr 24 , 2025 | 04:57 AM
హంసలదీవిలో పవిత్ర కృష్ణా సంగమ ప్రదేశంలో ఉన్న కృష్ణవేణమ్మ విగ్రహాన్ని సముద్రపు నీరు తాకింది. సముద్రం ఐదు మీటర్ల మేరకు ముందుకు రావడంతో ఈ ప్రదేశం పూర్తిగా జలమయమై భక్తుల్లో ఆందోళన నెలకొంది.
కోడూరు, ఏప్రిల్ 23(ఆంధ్రజ్యోతి): హంసలదీవి పవిత్ర కృష్ణా సంగమ ప్రదేశం వద్ద ఉన్న కృష్ణవేణమ్మ పాదాలను సముద్రపు నీరు తాకాయి. బుధవారం ఐదు మీటర్ల మేరకు సముద్రం ముందుకు రావటంతో కృష్ణవేణమ్మ విగ్రహం చుట్టూ జలమయమైంది. పవిత్ర కృష్ణా సంగమ ప్రదేశం సాగరుని గర్భంలో కలిసిపోతుందేమో అంటూ భక్తులు ఆందోళన చెందున్నారు.
హంసలదీవిలో పవిత్ర కృష్ణా సంగమ ప్రదేశంలో ఉన్న కృష్ణవేణమ్మ విగ్రహాన్ని సముద్రపు నీరు తాకింది. సముద్రం ఐదు మీటర్ల మేరకు ముందుకు రావడంతో ఈ ప్రదేశం పూర్తిగా జలమయమై భక్తుల్లో ఆందోళన నెలకొంది.