Share News

ప్రజా సమస్యలను వేగవంతంగా పరిష్కరించండి

ABN , Publish Date - Oct 06 , 2025 | 11:26 PM

పబ్లిక్‌ గ్రీవెన్స్‌ రిడ్రసెల్‌ సిస్టం-పీజీఆర్‌ఎస్‌ కార్యక్రమంలో వచ్చిన అర్జీలను ఏ ఒక్క అధికారి నిర్లక్ష్యం చేయకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించి అర్జీదారులను సంతృప్తిపరిచేలా చూడాలని ఆదోని సబ్‌కలెక్టర్‌ మౌర్యభరద్వాజ్‌ పేర్కొన్నారు.

 ప్రజా సమస్యలను వేగవంతంగా పరిష్కరించండి

ఆదోని, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి): పబ్లిక్‌ గ్రీవెన్స్‌ రిడ్రసెల్‌ సిస్టం-పీజీఆర్‌ఎస్‌ కార్యక్రమంలో వచ్చిన అర్జీలను ఏ ఒక్క అధికారి నిర్లక్ష్యం చేయకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించి అర్జీదారులను సంతృప్తిపరిచేలా చూడాలని ఆదోని సబ్‌కలెక్టర్‌ మౌర్యభరద్వాజ్‌ పేర్కొన్నారు. సబ్‌కలెక్టర్‌ కార్యాలయంలో పబ్లిక్‌ గ్రీవెన్స్‌ రిడ్రసెల్‌ సిస్టం-పీజీఆర్‌ఎ్‌స లో సబ్‌కలెక్టర్‌ పాల్గొని డివిజన్‌లోని ఆయా మండలాల ప్రజల నుంచి వచ్చిన అర్జీలను స్వీకరించారు. మండలంలోని ఆయా శాఖల అధికారులకు సంబంధించిన సమస్యలను తెలియజేస్తూ గడువులోపు పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ సర్వేయర్‌ వేణుసూర్య, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ పద్మజా, ఆర్టీసీ డిపో మేనేజర్‌ రఫీ, వ్యవసాయశాఖ అధికారి ఖాద్రి, ఆర్‌అండ్‌బి ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ పద్మనాభరెడ్డి, గృహనిర్మాణశాఖ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ చంద్రశేఖర్‌, ఆర్టీవో కార్యాలయపు పరిపాలనాధికారి రమాదేవి, ఉప తహసీల్దార్‌ రుద్రగౌడ్‌, శశిశేఖరరావు, రాఘవేంద్ర పాల్గొన్నారు.

Updated Date - Oct 06 , 2025 | 11:26 PM