AP Chambers State President: ఎంఎస్ఎంఈలకు ఇన్సెంటివ్స్ విడుదల చేయాలి
ABN , Publish Date - Jul 20 , 2025 | 05:12 AM
రాష్ట్రంలోని ఎంఎస్ఎంఈలకు దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ఇన్సెంటివ్లను విడుదల చేయాలని పరిశ్రమల సమాఖ్య (ఏపీ చాంబర్స్) రాష్ట్ర అధ్యక్షుడు పొట్లూరి భాస్కరరావు...
అమరావతి, జూలై 19 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలోని ఎంఎస్ఎంఈలకు దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ఇన్సెంటివ్లను విడుదల చేయాలని పరిశ్రమల సమాఖ్య (ఏపీ చాంబర్స్) రాష్ట్ర అధ్యక్షుడు పొట్లూరి భాస్కరరావు, ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్ ప్రభుత్వాన్ని కోరారు. యువతకు ఎక్కువ ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కల్పించే ఎంఎస్ఎంఈ రంగాన్ని బలోపేతం చేసేందుకు ఆర్థికాభివృద్ధి టాస్క్ఫోర్స్ చేసిన సూచనలను స్వాగతిస్తున్నట్లు శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.