RBI Regional Director: జనసురక్షతో సామాన్యులకు భద్రత
ABN , Publish Date - Jul 29 , 2025 | 05:29 AM
జన సురక్ష పథకాల ద్వారా సామాన్య ప్రజలకు భద్రత లభిస్తుందని ఆర్బీఐ రీజనల్ డైరెక్టర్ బషీర్ చెప్పారు.
ఆర్బీఐ రీజనల్ డైరెక్టర్ బషీర్
విజయవాడ, జూలై 28(ఆంధ్రజ్యోతి): జన సురక్ష పథకాల ద్వారా సామాన్య ప్రజలకు భద్రత లభిస్తుందని ఆర్బీఐ రీజనల్ డైరెక్టర్ బషీర్ చెప్పారు. దేశవ్యాప్తంగా జూలై 1 నుంచి సెప్టెంబరు 30 వరకు నిర్వహిస్తున్న జన సురక్ష ప్రత్యేక ప్రచార కార్యక్రమాల్లో భాగంగా సోమవారం గూడవల్లిలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(యూబీఐ) రీజనల్ హెడ్ ఎంవీ తిలక్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎస్ఎల్బీసీ కన్వీనర్ సీవీఎన్ భాస్కరరావు మాట్లాడుతూ అర్హులందరూ పథకాల్లో నమోదు చేసుకునేలా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు.