Weather Update: సీమలో వర్షాలు.. కోస్తాలో ఎండలు
ABN , Publish Date - Aug 06 , 2025 | 06:06 AM
రాయలసీమ, ఉత్తర తమిళనాడుకు ఆనుకుని నైరుతి బంగాళాఖాతంలో వేర్వేరుగా ఉపరితల ఆవర్తనాలు ఏర్పడ్డాయి. నైరుతి బంగాళాఖాతం నుంచి రాయలసీమ, కర్ణాటక మీదుగా అరేబియా...
విశాఖపట్నం, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి): రాయలసీమ, ఉత్తర తమిళనాడుకు ఆనుకుని నైరుతి బంగాళాఖాతంలో వేర్వేరుగా ఉపరితల ఆవర్తనాలు ఏర్పడ్డాయి. నైరుతి బంగాళాఖాతం నుంచి రాయలసీమ, కర్ణాటక మీదుగా అరేబియా వరకు ఉపరితల ద్రోణి విస్తరించింది. వీటి ప్రభావంతో మంగళవారం రాయలసీమలో ఎక్కువ చోట్ల, దక్షిణ కోస్తా, ఉత్తర కోస్తాలో పలుచోట్ల వర్షాలు కురిశాయి. కోస్తాలో ఎక్కువ చోట్ల ఎండ తీవ్రత కొనసాగింది. కావలిలో 38 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. రానున్న 24 గంటల్లో రాయలసీమలో అనేక చోట్ల, కోస్తాలో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని, అక్కడక్కడా భారీవర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఆ తర్వాత 2-3 రోజులు కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా భారీవర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.