Andhra Pradesh Government: 1,000 కోట్ల జీఎస్టీ ఎగవేతపై దర్యాప్తు చేయించాలి
ABN , Publish Date - Dec 31 , 2025 | 05:02 AM
విశాఖపట్నానికి చెందిన ఒక స్టీల్ వ్యాపార సంస్థ దాదాపు రూ.1000 కోట్ల మేర పన్ను (జీఎస్టీ) ఎగవేతపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక సంస్థతో దర్యాప్తు చేయించి...
అమరావతి, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి): విశాఖపట్నానికి చెందిన ఒక స్టీల్ వ్యాపార సంస్థ దాదాపు రూ.1000 కోట్ల మేర పన్ను (జీఎస్టీ) ఎగవేతపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక సంస్థతో దర్యాప్తు చేయించి, పన్ను ఎగవేతదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కేఆర్ సూర్యనారాయణ, జి.ఎం.రమే్షకుమార్ ప్రభుత్వాన్ని కోరారు. పన్ను ఎగవేతదారులతో కుమ్మక్కైన అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని వారు మంగళవారం డిమాండ్ చేశారు.