Share News

YSRCP rally: వైసీపీ ర్యాలీలో ప్రైవేటు విద్యార్థులు

ABN , Publish Date - Dec 16 , 2025 | 03:17 AM

కర్నూలు జిల్లా కేంద్రంలో వైసీపీ నిర్వహించిన కోటి సంతకాల ర్యాలీలో ఒక ప్రైవేట్‌ కళాశాలకు చెందిన విద్యార్థులు తరలిరావడం చర్చనీయాంశమైంది. ....

YSRCP rally: వైసీపీ ర్యాలీలో ప్రైవేటు విద్యార్థులు

కర్నూలు న్యూసిటీ, డిసెంబరు 14(ఆంధ్రజ్యోతి): కర్నూలు జిల్లా కేంద్రంలో వైసీపీ నిర్వహించిన కోటి సంతకాల ర్యాలీలో ఒక ప్రైవేట్‌ కళాశాలకు చెందిన విద్యార్థులు తరలిరావడం చర్చనీయాంశమైంది. సోమవారం కర్నూలు నగరంలోని రాజ్‌విహార్‌ నుంచి వైసీపీ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించాయి. ఈ ర్యాలీలో నగరంలో రాష్ట్ర వ్యాప్తంగా పేరొందిన ఓ కార్పొరేట్‌ కళాశాల విద్యార్థులు వైసీపీ జెండాలను చేత పట్టుకుని తిరిగారు. ఇదిలా ఉండగా ర్యాలీకి వచ్చిన కళాశాల విద్యార్థుల చేతికి పార్టీ జెండాలు బలవంతంగా ఇచ్చి, ర్యాలీలో పాల్గొనేలా వైసీపీ నాయకులు వ్యవహరించారని సమాచారం. ఇదే అంశంపై నగరవ్యాప్తంగా చర్చ సాగుతోంది.

Updated Date - Dec 16 , 2025 | 03:17 AM