High Court: ప్రసన్న కుమార్రెడ్డికి ముందస్తు బెయిల్
ABN , Publish Date - Sep 25 , 2025 | 05:31 AM
హెడ్కానిస్టేబుల్ విధులకు ఆటంకం కలిగించి, దాడికి పాల్పడ్డారనే ఆరోపణలతో నమోదైన కేసులో కోవూరు వైసీపీ మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డికి హైకోర్టు...
కానిస్టేబుల్పై దాడి కేసులో హైకోర్టు మంజూరు
అమరావతి, సెప్టెంబరు 24(ఆంధ్రజ్యోతి): హెడ్కానిస్టేబుల్ విధులకు ఆటంకం కలిగించి, దాడికి పాల్పడ్డారనే ఆరోపణలతో నమోదైన కేసులో కోవూరు వైసీపీ మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డికి హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. రూ. 50 వేల బాండ్తో రెండు పూచికత్తులు సమర్పించాలని పిటిషనర్కు ఆదేశించింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వై.లక్ష్మణరావు బుధవారం తీర్పు ఇచ్చారు. వైఎస్ జగన్ నెల్లూరుజిల్లా పర్యటన సందర్భంగా తన విధులకు ఆటంకం కలిగించడంతో పాటు తనపై దాడికి పాల్పడ్డారని ప్రసన్నకుమార్రెడ్డిపై స్పెషల్ బ్రాంచ్ హెడ్కానిస్టేబుల్ మాలకొండయ్య ఫిర్యాదు ఆధారంగా దర్గామిట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ప్రసన్నకుమార్రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై ఇటీవల హైకోర్టులో వాదనలు ముగిశాయి.