Share News

గుంతల దారులు...

ABN , Publish Date - Jul 12 , 2025 | 11:28 PM

మండలంలోని మిట్టకందాల, మద్దూరు రహదారి. మిట్టకందాల, మద్దూరు, క్రిష్ణరావుపేట, మిట్టకందాల, క్రిష్ణారావుపేట, చెలిమిళ్ల గ్రామాల రహదారులు అడుగడుగుకో గుంత ఏర్పడింది.

గుంతల దారులు...
అధ్వానంగా మారిన మిట్టకందాల, మద్దూరు రహదారి

ఇబ్బంది పడుతున్న ప్రజలు

పాములపాడు, జూలై 12 (ఆంధ్రజ్యోతి): మండలంలోని మిట్టకందాల, మద్దూరు రహదారి. మిట్టకందాల, మద్దూరు, క్రిష్ణరావుపేట, మిట్టకందాల, క్రిష్ణారావుపేట, చెలిమిళ్ల గ్రామాల రహదారులు అడుగడుగుకో గుంత ఏర్పడింది. ఈ రోడ్లపై ప్రయాణం నరకాన్ని తలపిస్తోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రహదారులకు మరమ్మతులు చేపట్టాలని అనేక సార్లు అధికారులను, ప్రజాప్రతినిధులను కోరినా పట్టించుకోవడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. రెండు కిలోమీటర్ల దూరం సుమారు అరగంట పడుతుందన్నారు. కూటమి ప్రభుత్వం స్పందించి రహదారులకు మరమ్మతులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.

Updated Date - Jul 12 , 2025 | 11:28 PM