Chittoor land dispute: అటవీ భూముల ఆక్రమణ కేసు కొట్టేయండి
ABN , Publish Date - May 22 , 2025 | 04:44 AM
చిత్తూరు జిల్లా మంగళంపేట వద్ద 75 ఎకరాల భూమి విషయంలో జోక్యం చేయొద్దని కోరుతూ పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్పై గురువారం హైకోర్టులో విచారణ జరగనుంది.
అధికారులు జోక్యం చేసుకోకుండా నిలువరించండి
హైకోర్టును ఆశ్రయించిన పెద్దిరెడ్డి, కుటుంబ సభ్యులు
అమరావతి, మే 21(ఆంధ్రజ్యోతి): చిత్తూరు జిల్లా పులిచర్ల మండలం మంగళంపేట గ్రామం పరిధిలోని వివిధ సర్వేనెంబర్లలో తమ ఆధీనంలో ఉన్న 75.74 ఎకరాల భూమి నుంచి ఖాళీ చేయించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారంటూ వైసీపీ ఎమ్మెల్యే(పుంగనూరు) పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన సోదరుడు, తంబళ్లపల్లె ఎమ్మెల్యే ద్వారకానాథ్రెడ్డి, కుమారుడు, రాజంపేట ఎంపీ మిథున్రెడ్డి, పెద్దిరెడ్డి తమ్ముడి సతీమణి పి.ఇందిరమ్మ హైకోర్టును ఆశ్రయించారు. భూమి విషయంలో జోక్యం చేసుకోకుండా అధికారులను నిలువరించాలని కోరారు. వీరి పిటిషన్పై హైకోర్టు గురువారం విచారణ జరపనుంది.
Also Read:
Optical Illusion Test: మీవి డేగ కళ్లు అయితేనే.. ఈ గదిలో పెన్సిల్ను 5 సెకెన్లలో కనిపెట్టగలరు
Milk: ఇలాంటి వారికి పాలు డేంజర్.. ఎట్టి పరిస్ధితిలోనూ తాగకూడదు..
Little girl Stotram: వావ్.. ఈ బాలిక స్ఫూర్తికి సలాం.. శివ తాండవ స్త్రోత్రం ఎలా చెబుతోందో చూడండి