Share News

పండుగ వాతావరణంలో ప్రమాణాలు: పల్లా

ABN , Publish Date - Nov 11 , 2025 | 05:33 AM

రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం నుంచి జరగనున్న టీడీపీ సంస్థాగత కమిటీల ప్రమాణస్వీకారాన్ని పండుగ వాతావరణంలో నిర్వహించాలని టీడీపీ రాష్ట్ర...

పండుగ వాతావరణంలో ప్రమాణాలు: పల్లా

అమరావతి, నవంబరు 10(ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం నుంచి జరగనున్న టీడీపీ సంస్థాగత కమిటీల ప్రమాణస్వీకారాన్ని పండుగ వాతావరణంలో నిర్వహించాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌ పార్టీ శ్రేణులను ఆదేశించారు. సోమవారం పార్టీ ముఖ్య నేతలతో ఆయన టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా పల్లా మాట్లాడుతూ.. మంగళవారం నుంచి మూడు రోజులపాటు జరిగే మండల, క్లస్టర్‌, యూనిట్‌, గ్రామ, బూత్‌ కమిటీల ప్రమాణస్వీకార కార్యక్రమాలను ప్రతి నియోజకవర్గం, మండలం, గ్రామ స్థాయిలో బాగా నిర్వహించాలన్నారు. కొత్తగా నియమితులైన కమిటీ సభ్యులకు అభినందనలు తెలిపారు.

Updated Date - Nov 11 , 2025 | 05:33 AM