10 గేట్ల ద్వారా కొనసాగుతున్న నీటి విడుదల
ABN , Publish Date - Sep 24 , 2025 | 11:31 PM
శ్రీశైలం జలాశయం నీటిమట్టం బుధవారం సాయంత్రం 6 గంటల సమయానికి 882 అడుగులు గానూ, నీటినిల్వ సామర్ధ్యం 199 టీఎంసీలుగానూ ఉన్నట్లు అధికారులు తెలిపారు.
882 అడుగులుగా శ్రీశైలం డ్యాం నీటిమట్టం
శ్రీశైలం, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): శ్రీశైలం జలాశయం నీటిమట్టం బుధవారం సాయంత్రం 6 గంటల సమయానికి 882 అడుగులు గానూ, నీటినిల్వ సామర్ధ్యం 199 టీఎంసీలుగానూ ఉన్నట్లు అధికారులు తెలిపారు. డ్యాం గరిష్ట స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా నీటినిల్వ సామర్ధ్యం 215 టీఎంసీలుగా ఉందన్నారు. రిజర్వాయర్కు ఎగువ జూరాల స్పిల్వే నుంచి 2,21,120 క్యూసెక్కులు, విద్యుత ఉత్పత్తికి 27,927 క్యూసెక్కులు, సుంకేసుల నుంచి 17,784 క్యూసెక్కులు, హంద్రీ నుంచి 2000 క్యూసెక్కులు ఇనఫ్లో వచ్చి చేరాయి. ప్రాజెక్టు 10 క్రస్ట్గేట్లను ఒక్కొక్కటి 14 అడుగుల ఎత్తు మేరకు తెరిచి స్పిల్వే గుండా 3,45,730 క్యూసెక్కులు సాగర్కు విడుదల చేశారు. శ్రీశైలం రెండు విద్యుత కేంద్రాల్లో ఉత్పత్తి అనంతరం 65,341 క్యూసెక్కులు విడుదల చేశారు.