Anakapalli District: సింహాద్రి ఎన్టీపీసీ మొదటి యూనిట్ షట్డౌన్
ABN , Publish Date - Nov 24 , 2025 | 05:01 AM
అనకాపల్లి జిల్లా పరవాడ మండలంసింహాద్రి సూపర్ థర్మల్ విద్యుత్ కేంద్రం (ఎన్టీపీసీ)లోని 500 మెగావాట్ల సామర్థ్యం కలిగిన..
500 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం
పరవాడ (అనకాపల్లి జిల్లా), నవంబరు 23 (ఆంధ్రజ్యోతి): అనకాపల్లి జిల్లా పరవాడ మండలంసింహాద్రి సూపర్ థర్మల్ విద్యుత్ కేంద్రం (ఎన్టీపీసీ)లోని 500 మెగావాట్ల సామర్థ్యం కలిగిన మొదటి యూనిట్ను అధికారులు శనివారం అర్ధరాత్రి షట్డౌన్ చేశారు. వార్షిక నిర్వహణ పనుల నిమిత్తం చేపట్టిన చర్యల్లో భాగంగా ఈ యూనిట్లో రెండు నెలల పాటు విద్యుదుత్పత్తికి అంతరాయం ఉంటుందన్నారు. యూనిట్లోని అన్ని విభాగాల్లో మరమ్మతులు చేపట్టడం కోసం అదనంగా 200 మంది కాంట్రాక్టు కార్మికులను విధుల్లోకి తీసుకున్నారు. ప్రస్తుతం ప్లాంట్లో రెండు, మూడు, నాలుగు యూనిట్లలో మాత్రమే ఉత్పత్తి జరుగుతున్నదని వెల్లడించారు.