కనకదుర్గమ్మ సన్నిధిలో ఎమ్మెల్యేలు
ABN , Publish Date - Sep 26 , 2025 | 11:11 PM
దేవీనవరాత్రులను పురస్కరించుకుని విజయవాడలోకి ఇంద్రకీలాద్రిపై వెల సిన కనక దుర్గమ్మ అమ్మవారిని శుక్ర వారం శ్రీశైలం, నందికొట్కూరు ఎమ్మెల్యేలు బుడ్డా రాజశేఖరరెడ్డి, గిత్తా జయసూర్య దర్శించుకున్నారు.
ఆత్మకూరు, సెప్టెంబరు 26(ఆంధ్రజ్యోతి): దేవీనవరాత్రులను పురస్కరించుకుని విజయవాడలోకి ఇంద్రకీలాద్రిపై వెల సిన కనక దుర్గమ్మ అమ్మవారిని శుక్ర వారం శ్రీశైలం, నందికొట్కూరు ఎమ్మెల్యేలు బుడ్డా రాజశేఖరరెడ్డి, గిత్తా జయసూర్య దర్శించుకున్నారు. ముందుగా దేవస్థానం అధికారులు వారికి ఆల య మర్యాదలతో అమ్మవారి దర్శనం చేయించారు. ఆతర్వాత అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. వీరి వెంటే టీడీపీ నాయకులు వై.యుగంధర్రెడ్డి, బండ్లమూరి వెంకటేశ్వరరావు తదితరులున్నారు.