Mithun Reddy: రెగ్యులర్ బెయిల్ ఇవ్వండి
ABN , Publish Date - Sep 09 , 2025 | 05:02 AM
వైసీపీ హయాంలో జరిగిన భారీ మద్యం కుంభకోణంలో ఏ-4 నిందితుడిగా ఉన్న రాజంపేట ఎంపీ మిథున్రెడ్డి విజయవాడలోని ఏసీబీ కోర్టులో 2 పిటిషన్లు దాఖలు చేశారు.
ఇంటి భోజనానికి అనుమతించండి: ఏసీబీ కోర్టులో మిథున్రెడ్డి
విజయవాడ, సెప్టెంబరు 8(ఆంధ్రజ్యోతి): వైసీపీ హయాంలో జరిగిన భారీ మద్యం కుంభకోణంలో ఏ-4 నిందితుడిగా ఉన్న రాజంపేట ఎంపీ మిథున్రెడ్డి విజయవాడలోని ఏసీబీ కోర్టులో 2 పిటిషన్లు దాఖలు చేశారు. రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో ఉన్న తనకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయడంతోపాటు జైల్లో ఉన్నన్ని రోజులు 2 పూటలా ఇంటి నుంచి భోజనం అనుమతించాలని పిటిషన్లలో అభ్యర్థించారు. వీటిపై విచారణను ఏసీబీ కోర్టు ఈ నెల 12వ తేదీకి వాయిదా వేసింది. అదేవిధంగా జైల్లో ఉన్న మిథున్రెడ్డికి పలు సదుపాయాలు కల్పిస్తూ ఏసీబీ కోర్టు గతంలో ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, ఈ ఉత్తర్వులను పునః సమీక్షించాలని కోరుతూ జైళ్ల శాఖ అధికారులు ఇదే కోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై కూడా 12వ తేదీన విచారణ చేపడతామని కోర్టు తెలిపింది.
సజ్జల బెయిల్ పిటిషన్ దాఖలు: మద్యం కేసులో విజయవాడ జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న సజ్జల శ్రీధర్రెడ్డి మరోసారి ఏసీబీ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. తాజాగా రిమాండ్ ఖైదీలుగా ఉన్న నలుగురికి బెయిల్ రావడంతో ఆయన మూడోసారి బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.