Krishna District: డోకిపర్రులో సుందరీమణుల సందడి
ABN , Publish Date - Aug 20 , 2025 | 06:25 AM
కృష్ణా జిల్లా డోకిపర్రు గ్రామంలో విశ్వసుందరి-2025, ఏషియన్ సుందరి హల్చల్ చేశారు.
గుడ్లవల్లేరు, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): కృష్ణా జిల్లా డోకిపర్రు గ్రామంలో విశ్వసుందరి-2025, ఏషియన్ సుందరి హల్చల్ చేశారు. ప్రముఖ పారిశ్రామికవేత్త ఎంఈఐఎల్ ఎండీ పీవీ కృష్ణారెడ్డి స్వగ్రామం డోకిపర్రులో ఆయన సతీమణి సుధారెడ్డి నిర్వహణలోని సుధా ఫౌండేషన్, ఎంఈఐఎల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంగళవారం రొమ్ముకేన్సర్ నిర్ధారణ పరీక్షల వైద్యశిబిరం నిర్వహించారు. ఈ శిబిరాన్ని విశ్వసుందరి ఓపెల్ సుచతా చుంవాంగ్రీస్, ఏషియన్ సుందరి కిృష్ణా గ్రావిడేజ్ ప్రారంభించారు.