Minister Sandhyarani Philanthropy: మంత్రి సంధ్యారాణి దాతృత్వం
ABN , Publish Date - Jul 06 , 2025 | 03:30 AM
మంత్రి గుమ్మిడి సంధ్యారాణి దాతృత్వం చాటుకున్నారు. పీ4 లో భాగంగా 10 కుటుంబాలను దత్తత తీసుకుంటానని ప్రకటించారు.
పీ4లో 10 కుటుంబాల దత్తత
పార్వతీపురం, జూలై 5(ఆంధ్రజ్యోతి): మంత్రి గుమ్మిడి సంధ్యారాణి దాతృత్వం చాటుకున్నారు. పీ4 లో భాగంగా 10 కుటుంబాలను దత్తత తీసుకుంటానని ప్రకటించారు. ఆ కుటుంబాల ఆర్థిక, సామాజిక అభివృద్ధికి బాధ్యత తీసుకుంటానన్నారు. శనివారం పార్వతీపురం జిల్లా సాలూరులో పీ4 ప్లానింగ్పై ప్రత్యేక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి ఈ ప్రకటన చేశారు. సాలూరు నియోజకవర్గంలో 10 కుటుంబాలను తాను దత్తత తీసుకుంటున్నట్టు ప్రకటించారు.