Minister Kolusu Parthasarathi: 2029లో టీడీపీ విజయానికి తొలి మెట్టు
ABN , Publish Date - Aug 15 , 2025 | 05:51 AM
పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల ఫలితం.. 2029లో జరిగే ఎన్నికల్లో టీడీపీ విజయానికి తొలి మెట్టు అని మంత్రి కొలుసు ..
అమరావతి, ఆగస్టు 14(ఆంధ్రజ్యోతి): పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల ఫలితం.. 2029లో జరిగే ఎన్నికల్లో టీడీపీ విజయానికి తొలి మెట్టు అని మంత్రి కొలుసు పార్ధసారథి వ్యాఖ్యానించారు. గురువారం అమరావతి సచివాలయంలో మంత్రి మీడియాతో మాట్లాడుతూ ‘ఓటమిని గౌరవంగా అంగీకరించకుండా.. ముసలోడివి, నీకివే చివరి ఎన్నికలు అంటూ చంద్రబాబును జగన్ దిగజారి మాట్లాడటం జుగుప్సాకరం’ అని అన్నారు.