Share News

Nadendla Manohar: 22 ఏ భూములపై ఏలూరులో మెగా గ్రీవెన్స్‌ సెల్‌

ABN , Publish Date - Dec 17 , 2025 | 06:24 AM

లూరు జిల్లాలో 22 ఏ కింద నిషేధిత భూ ముల సమస్యల పరిష్కారానికి జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి నాదెండ్ల మనోహర్‌ ఆధ్వర్యంలో....

Nadendla Manohar: 22 ఏ భూములపై ఏలూరులో మెగా గ్రీవెన్స్‌ సెల్‌

  • ఏలూరు జిల్లా రోల్‌ మోడల్‌గా నిలుస్తుందన్న మంత్రి నాదెండ్ల

ఏలూరు, డిసెంబరు 16(ఆంధ్రజ్యోతి): ఏలూరు జిల్లాలో 22 ఏ కింద నిషేధిత భూ ముల సమస్యల పరిష్కారానికి జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి నాదెండ్ల మనోహర్‌ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన మెగా గ్రీవెన్స్‌ సెల్‌కు అనూహ్య స్పందన లభించింది. రాష్ట్రంలోనే తొలిసారిగా ఏలూరులో నిర్వహించిన ఈ గ్రీవెన్స్‌లో జిల్లాలోని 27 మండలాలకు చెందిన రైతులు, మాజీ సైనికులు, ఇతర వర్గాల ప్రజల నుంచి సుమారు 70 వరకు ఫిర్యాదులందాయి. రెవెన్యూ, దేవదాయ, రిజిస్ర్టేషన్‌ శాఖల ఆధ్వర్యంలో సమస్యలకు రెండు వారాల్లో పరిష్కార మార్గాలను అన్వేషించాలని మంత్రి అధికారులను ఆదేశించారు.

Updated Date - Dec 17 , 2025 | 06:25 AM