Donation: శ్రీపాదశ్రీవల్లభ మహా సంస్థానానికి భారీ విరాళం
ABN , Publish Date - Dec 05 , 2025 | 06:21 AM
దత్త జయం తి పర్వదినాన కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణంలోని శ్రీపాదశ్రీవల్లభ మహా సంస్థానానికి భారీ విరాళం అందింది.
రూ.2 కోట్ల విలువైన స్థలం, ఇల్లు అందజేత
పిఠాపురం, డిసెంబరు 4 (ఆంధ్రజ్యోతి): దత్త జయం తి పర్వదినాన కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణంలోని శ్రీపాదశ్రీవల్లభ మహా సంస్థానానికి భారీ విరాళం అందింది. బెంగళూరుకు చెందిన చక్కా వెంకట రాజేశ్వర్ పిఠాపురం మహారాజా కోట ప్రాంతంలో 940 చదరపు గజాల విస్తీర్ణంలో భవంతి నిర్మించారు. రూ.2 కోట్లు విలువ చేసే ఈ ఆస్తిని శ్రీపాదశ్రీవల్లభులకు విరాళంగా ఇవ్వాలని నిర్ణయించారు. అంగీకార పత్రాలను దత్త జయంతి రోజైన గురువారం మహా సంస్థానం ప్రాంగణంలో ఆలయ కార్యనిర్వహణాధికారి ఆర్.సౌజన్యకు అందజేశారు. దాతను ఈవో ఆలయ మర్యాదలతో సత్కరించి ప్రసాదాలు అందజేయగా వేదపండితులు ఆశీర్వచనం ఇచ్చారు.