Share News

సమష్టి కృషితోనే మహానాడు విజయవంతం : చమర్తి

ABN , Publish Date - May 31 , 2025 | 12:08 AM

ఉమ్మడి కడప జిల్లాలో నిర్వహించిన తెలుగుదేశంపార్టీ పండుగ మహానాడు విజయానికి ప్రతి కార్యకర్త, నాయకుడు కృషి చేశారని పార్లమెంట్‌ అధ్యక్షుడు చమర్తి జగనమోహనరాజు అన్నారు.

సమష్టి కృషితోనే మహానాడు విజయవంతం : చమర్తి
చమర్తిని సత్కరించిన నేతలు, కార్యకర్తలు

రాజంపేట టౌన, మే 30 (ఆంధ్రజ్యోతి) : ఉమ్మడి కడప జిల్లాలో నిర్వహించిన తెలుగుదేశంపార్టీ పండుగ మహానాడు విజయానికి ప్రతి కార్యకర్త, నాయకుడు కృషి చేశారని పార్లమెంట్‌ అధ్యక్షుడు చమర్తి జగనమోహనరాజు అన్నారు. శుక్రవారం పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మహానాడు విజయవంతం కావడానికి అందరి కృషే నిదర్శనమన్నారు. రాజంపేట నియోజకవర్గంలోని ఆరు మండలాల నుంచి విశేషంగా ప్రజలు, కార్యకర్తలు, నేతలు హాజరయ్యారని తెలిపారు. ఈ మహానాడుకు జన సమీకరణలో అనుకున్న లక్ష్యం కన్నా ఎక్కువగా మహిళలు తరలివచ్చారన్నారు. ఈ సందర్భంగా నేతలు, కార్యకర్తలు చమర్తికి శాలువా వేసి సత్కరించారు.

Updated Date - May 31 , 2025 | 12:08 AM