Minister TG Bharat: భారీ పరిశ్రమలకు తక్కువ ధరలకే భూములు
ABN , Publish Date - Sep 26 , 2025 | 05:28 AM
రాష్ట్రంలో పెద్ద పరిశ్రమ ఏర్పాటుకు ముందుకు వచ్చే కంపెనీలతో లోతుగా చర్చించి, తక్కువ ధరలకే వారికి భూ కేటాయింపులు చేస్తామని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ తెలిపారు.
పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్
అమరావతి, సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పెద్ద పరిశ్రమ ఏర్పాటుకు ముందుకు వచ్చే కంపెనీలతో లోతుగా చర్చించి, తక్కువ ధరలకే వారికి భూ కేటాయింపులు చేస్తామని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ తెలిపారు. గురువారం అసెంబ్లీలో బొబ్బిలి ఎమ్మెల్యే ఆర్.వి.ఎ్స.కె.కె.రంగారావు అడిగిన ప్రశ్నకు ఆయన బదులిచ్చారు. తొలుత మాట్లాడిన ఎమ్మెల్యే.. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వస్తాయన్న ఉద్దేశంతో బొబ్బిలిలో ఏపీఐఐసీ ఏర్పాటు చేసిన గ్రోత్ సెంటర్ కోసం 5 గ్రామాల ప్రజలు భూములు ఇచ్చారని, కొన్ని కంపెనీలు ఇప్పటికి ప్లాంట్స్ ఏర్పాటు చేయలేదని చెప్పారు. కొన్ని కంపెనీలైతే రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా చేస్తున్నాయన్నారు. అలానే దర్జీలకు ఉపాధి అవకాశాలపై ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ అడిగిన ప్రశ్నలకు మంత్రి సబిత సమాధానం చెప్పారు. మహిళలకు టైలరింగ్లో శిక్షణ ఇవ్వడంతో పాటు కుట్టుమిషన్లు కూడా ఉచితంగా అందిస్తున్నామని, త్వరలో ఎంబ్రాయిడరీ, ఇతర అనుబంధ పనులపై కూడా శిక్షణ ఇచ్చే ఆలోచన ఉందని మంత్రి చెప్పారు.