Legal Services Authority: న్యాయసేవాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా జస్టిస్ మానవేంద్రనాథ్రాయ్
ABN , Publish Date - Nov 11 , 2025 | 06:34 AM
ఏపీ న్యాయసేవాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మానవేంద్రనాథ్రాయ్ నియమితులయ్యారు.
అమరావతి, నవంబరు 10(ఆంధ్రజ్యోతి): ఏపీ న్యాయసేవాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మానవేంద్రనాథ్రాయ్ నియమితులయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఈ ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టులో రెండో స్థానంలో ఉన్న న్యాయమూర్తిని న్యాయసేవాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా నియమించడం సాంప్రదాయంగా వస్తోంది. హైకోర్టు సీజేను సంప్రదించిన తర్వాత ఎగ్జిక్యూటివ్ చైర్మన్ను గవర్నర్ నామినేట్ చేస్తారు.