Share News

Justice N Harinath: శ్రీవారి సేవలో జస్టిస్‌ హరినాథ్‌

ABN , Publish Date - Dec 26 , 2025 | 04:44 AM

రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.హరినాథ్‌ తిరుమల శ్రీవారిని గురువారం దర్శించుకున్నారు.

Justice N Harinath: శ్రీవారి సేవలో జస్టిస్‌ హరినాథ్‌

తిరుమల, డిసెంబరు 25 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.హరినాథ్‌ తిరుమల శ్రీవారిని గురువారం దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ బ్రేక్‌ సమయంలో కుటుంబ సమేతంగా ఆయన స్వామి వారిని దర్శించుకున్నారు. అలాగే హైకోర్టు రిజిస్ర్టార్‌ శ్రీనివాస శర్మ, అలహాబాద్‌ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ అరుణ్‌కుమార్‌ సిన్హా కూడా శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయక మండపంలో వేదపండితులు ఆశీర్వచనం చేయగా అధికారులు లడ్డూప్రసాదాలు అందజేశారు.

Updated Date - Dec 26 , 2025 | 04:44 AM