Share News

Speaker Ayyna Patrudu: ప్రజాసమస్యల పరిష్కారంలో జాయింట్‌ కమిటీలదే కీలకపాత్ర

ABN , Publish Date - Sep 28 , 2025 | 05:28 AM

ప్రభుత్వ పాలనను సమీక్షించి ప్రజలకు న్యాయం జరిగేలా చేయడంలో అసెంబ్లీ జాయింట్‌ కమిటీలు కీలక పాత్ర పోషిస్తాయని స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు.

Speaker Ayyna Patrudu: ప్రజాసమస్యల పరిష్కారంలో జాయింట్‌ కమిటీలదే కీలకపాత్ర

  • స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు వెల్లడి

అమరావతి, సెప్టెంబరు 27(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాలనను సమీక్షించి ప్రజలకు న్యాయం జరిగేలా చేయడంలో అసెంబ్లీ జాయింట్‌ కమిటీలు కీలక పాత్ర పోషిస్తాయని స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు. అసెంబ్లీ ప్రాంగణంలోని సమావేశ మందిరంలో శనివారం స్పీకర్‌, శాసనమండలి చైర్మన్‌ కొయ్యే మోషేన్‌ రాజు ఆధ్వర్యంలో 8 జాయింట్‌ కమిటీలు తొలిసారి సమావేశమయ్యాయి. ఈ సందర్భంగా స్పీకర్‌ మాట్లాడుతూ.. ఈ కమిటీలు ప్రజాస్వామ్యంలో కీలక పాత్ర పోషిస్తాయన్నారు. సభ్యులు జిల్లాల్లో పర్యటించి ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని, పరిష్కార మార్గాలను సూచించాలని కోరారు. అవసరమైతే ఇతర రాష్ట్రాల్లోనూ పర్య టించాలని కోరారు. సభా సమావేశాలు ఏడాది పొడవునా జరపటం సాధ్యం కాని పనికావడంతో, ఈ కమిటీలు సభ పని భారాన్ని పంచుకుంటాయని, ఏడాది పొడవునా పనిచేస్తాయని అన్నారు. ‘మహిళలు, పిల్లలు, వృద్ధులు, వికలాంగు లు వంటి వర్గాల సంక్షేమానికి మనం తీసుకునే చర్యలు నైతిక బాధ్యత మాత్రమే కాదు.. రాజ్యాంగబద్ధమైన విధి’ అని స్పీకర్‌ పేర్కొన్నారు.

Updated Date - Sep 28 , 2025 | 05:29 AM