Old Pension Scheme: డీఎస్సీ-2003 టీచర్లకు ఓపీఎస్ అమలు చేయాలి
ABN , Publish Date - Jul 31 , 2025 | 06:07 AM
డీఎస్సీ-2003 నోటిఫికేషన్ టీచర్లకు పాత పెన్షన్ విధానం అమలుచేయాలని డీఎస్సీ-2003 టీచర్ల ఫోరం ప్రభుత్వాన్ని కోరింది.
అమరావతి, జూలై 30(ఆంధ్రజ్యోతి): డీఎస్సీ-2003 నోటిఫికేషన్ టీచర్లకు పాత పెన్షన్ విధానం అమలుచేయాలని డీఎస్సీ-2003 టీచర్ల ఫోరం ప్రభుత్వాన్ని కోరింది. మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు ఆధ్వర్యంలో ఫోరం నేతలు బుధవారం సచివాలయంలో సీఎస్ కె.విజయానంద్ను కలిసి వినతిపత్రం సమర్పించారు. సీపీఎస్ అమలు తేదీ కంటే ముందే డీఎస్సీ-2003 నోటిఫికేషన్ విడుదలైందని, కానీ ప్రభుత్వాల జాప్యం వల్ల ఉద్యోగాల్లో చేరడం ఆలస్యమైందని, అందువల్ల తమకు ఓపీఎస్ అమలుచేయాలని కోరారు.