Share News

CS K. Vijayanand: తిరుపతి ఓట్ల వ్యవహారంలో ఐఏఎస్‌ గిరిశాకు ఉపశమనం

ABN , Publish Date - Sep 11 , 2025 | 05:37 AM

తిరుపతి లోక్‌సభ నియోజకవర్గం ఉప ఎన్నిక సమయంలో దొంగ ఓటరు కార్డులు సృష్టించారన్న ఆరోపణలతో సస్పెండైన 2013 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారి పీఎస్‌ గిరిశాకు ఉపశమనం లభించింది.

CS K. Vijayanand: తిరుపతి ఓట్ల వ్యవహారంలో ఐఏఎస్‌ గిరిశాకు ఉపశమనం

  • తదుపరి చర్యలు నిలిపివేత.. ఆయన పాత్ర లేదని క్లీన్‌ చిట్‌

అమరావతి, సెప్టెంబరు 10(ఆంధ్రజ్యోతి): తిరుపతి లోక్‌సభ నియోజకవర్గం ఉప ఎన్నిక సమయంలో దొంగ ఓటరు కార్డులు సృష్టించారన్న ఆరోపణలతో సస్పెండైన 2013 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారి పీఎస్‌ గిరిశాకు ఉపశమనం లభించింది. ఈ వ్యవహారంలో గిరిశాకు ఎలాంటి పాత్ర లేదని ప్రభుత్వానికి విచారణాధికారి నివేదిక అందించారు. దీంతో ప్రభుత్వం ఆయనపై తదుపరి చర్యలను నిలిపివేసింది. బుధవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్‌ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. చీఫ్‌ ఎలక్ట్రోల్‌ ఆఫీసర్‌ ద్వారా కేంద్ర ఎన్నికల కమిషన్‌కు నివేదిక పంపారు. దొంగ ఓటరు కార్డుల వ్యవహారం అప్పట్లో పెద్ద దుమారం రేపింది. సాధారణ ఎన్నికలకు ముందు కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహించిన సమావేశాల్లో ఈ విషయాన్ని ప్రస్తావించింది. సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. చిత్తూరు కలెక్టర్‌గా ఉన్న గిరిశాను విధుల నుంచి సస్పెండ్‌ చేసింది. ఆయన తిరుపతి మున్సిపల్‌ కమిషనర్‌గా ఉన్న సమయంలో ఈ వ్యవహరం జరిగిందని ఈసీ పేర్కొంది. ప్రభుత్వం ఎస్‌.సురేశ్‌ కుమార్‌ను విచారణాధికారిగా నియమించింది. ఆయన క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టారు. దొంగ ఓటరు కార్డుల వ్యవహారంలో గిరిశా పాత్ర లేదని తేలడంతో ప్రభుత్వం తదుపరి చర్యలను నిలిపివేసింది.

Updated Date - Sep 11 , 2025 | 05:39 AM