X Platform: సీఎంకు గవర్నర్ అభినందనలు
ABN , Publish Date - Oct 11 , 2025 | 06:28 AM
ముఖ్యమంత్రిగా 15 ఏళ్లు పూర్తి చేసుకున్న సీఎం చంద్రబాబుకు గవర్నర్ అబ్దుల్ నజీర్ ఎక్స్ వేదికగా హృదయపూర్వక అభినందనలు తెలిపారు
అమరావతి, అక్టోబరు 10 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రిగా 15 ఏళ్లు పూర్తి చేసుకున్న సీఎం చంద్రబాబుకు గవర్నర్ అబ్దుల్ నజీర్ ‘ఎక్స్’ వేదికగా హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ‘సీఎం చంద్రబాబు విజనరీ లీడర్. ఆయన నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధిపథంలో నడుస్తుందన్న నమ్మకం ఉంది. ఆయన ఆయురారోగ్యాలతో ప్రజా సేవలో ముందుకు సాగాలి’ అని ఆకాంక్షిస్తూ ట్వీట్ చేశారు.