Abdul Nazeer Visits Tirumala: శ్రీవారి సేవలో గవర్నర్ అబ్దుల్ నజీర్
ABN , Publish Date - Sep 17 , 2025 | 03:38 AM
రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ మంగళవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో...
తిరుమల, సెప్టెంబరు 16(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ మంగళవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకున్న అనంతరం ఆయన రంగనాయక మండపానికి చేరుకోగా వేద పండితులు ఆశీర్వచనం చేశారు. అధికారులు లడ్డూ ప్రసాదాలు అందజేశారు.